మనకు రోజుకు ఒక వ్యక్తికి 6 గ్రాముల ఉప్పు అవసరం. పళ్లు, కూరగాయల్లో సహజసిద్దంగా ఉప్పు ఉంటుంది. ఇది మన శరీరం పనిచేయడానికి తోడ్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఉప్పును తగ్గించుకోవచ్చు.
1. నిల్వ ఉన్న, బయట దొరికే ప్రాసెస్ ఫుడ్స్ పూర్తిగా మానాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఉప్పు ఎక్కువుంటుంది.
2. ఆహారం తినే సమయంలో ఉప్పు డబ్బా పెట్టుకోకూడదు.
3. ఉప్పుకు బుదులు రుచికలిగించేవి, సుగంధద్రవ్యాలు, నిమ్మరసం, వెనిగర్, మిరియాలపొడి, ఉల్లిపాయలు వాడాలి.
4. డబ్బాల్లో నిల్వ ఉన్న పదార్థాలకు బదులుగా తాజా పళ్లు తీసుకోవాలి.
5. ఉప్పుతో తయారు చేసిన స్నాక్స్, చిప్స్ను బాగా తగ్గించాలి.
6. ఉప్పు కలుపుకోకుండా మజ్జిగ తీసుకోవాలి.
7. పొటాషియం ఎక్కువుండే అరటిపళ్లను అధికంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేస్తాయి.
8. అధిక బరువు ఉన్నవారు తమ ఎత్తు, వయసుకు తగ్గ బరువుండాలి.
9. ఆల్కహాలు, ధూమపానం మానాలి.
10. ఆహార పదార్థాల మీద అదనంగా ఉప్పు చల్లుకోవడం మానాలి.
