మామిడి పండ్ల & మామిడి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు.


మామిడి పండ్లను తినడం 
వల్ల కలిగే ప్రయోజనాలు:

  • మామిడిపండు అజీర్ణం మరియు అరుగుదల సరిగా లేకపోవడం వంటి జీర్ణ సంబందిత సమస్యలను తగ్గిస్తుంది.
  • సన్నగా ఉన్నవారు, బరువు పెరగాలంటే తప్పకుండా మామిడి పండ్లను తినండి.  
  • మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. చర్మ సౌందర్యానికి మామిడి చాలా మేలు చేస్తుంది.
  • మామిడి పండ్లలో విటమిన్ సి, ఎ పుష్కలంగా ఉన్నాయి. చర్మ సౌందర్యానికి మామిడి చాలా మేలు చేస్తుంది
  • ఈ పండులోని విటమిన్ ఏ తోపాటు లభించే కెరోటిన్.. దృష్టి నష్టాన్ని నివారించి.. కంటిశుక్లం వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • వ‌డ‌దెబ్బను నివారిస్తుంది వేస‌వి లో భానుడి ప్ర‌తాపం నుంచి ఉప‌శ‌మ‌నం కోసం ఈ పండు చాలా చ‌క్క‌గా ప‌నిచేస్తోంది.
  • మామిడి పండ్లను తినడంవల్ల ఎముకలు విరగడాన్ని నివారించుకోవడమే కాకుండా ఎముక బలాన్ని మెరుగుపర్చుకోవచ్చు.
  • ఈ పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉండి వీటిని తినడం వలన రక్తహీనత సమస్య నుంచి మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  •  మామిడి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. అవి అధిక రక్తపోటు నుంచి రక్షిస్తాయి.
  • ఇది క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నివారించే సామర్ధ్యం వీటికి ఉన్నదని పరిశోధనలో తేలింది.
  • మామిడి పండు తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

మామిడి ఆకుల ఆరోగ్య ప్రయోజనాలు:

  • మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 
  • చక్కెరవ్యాధి (మధుమేహం) నియంత్రించడంలో మామిడి ఆకుల మిశ్ర‌మం చ‌క్క‌టి పాత్ర‌ని పోషిస్తాయి.
  • మామిడి ఆకులు, నీటి మిశ్ర‌మం హైబీపీని త‌గ్గిస్తుంది. రోజుకు 2 సార్లు ఈ మిశ్ర‌మాన్ని తాగితే  మంచి ఫలితం లభిస్తుంది.
  • మామిడి ఆకుల్లోనూ పోష‌కాలు అధికంగా ఉంటాయి.  దీని వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.  
  • విరేచ‌నాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు మామిడి ఆకుల‌ నీటి  మిశ్ర‌మాన్ని  తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • దగ్గు సమస్య ఉన్నవారికి మామిడాకులు ఎంతో మేలు చేస్తాయి.
  • మామిడి ఆకులు కాల్చడం వలన వాటి నుంచి వెలువడే పొగ పీల్చడం ద్వారా వెక్కిళ్ల ను తగ్గించవచ్చు.

మామిడి ఆకుల మిశ్ర‌మం(టీ) తయారు చేయు విధానం.

ఒక పాత్ర‌లో త‌గినంత నీటిని తీసుకుని అందులు కొన్ని మామిడి ఆకులు వేయాలి. త‌రువాత ఆ నీటిని బాగా మ‌రిగించాలి. దీంతో నీరు రంగు మారుతుంది. త‌రువాత స్ట‌వ్ ఆర్పి ఆ మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌నివ్వాలి. అనంత‌రం దాన్ని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఇలా మామిడి ఆకుల‌తో త‌యారు చేసిన మిశ్ర‌మాన్ని తాగ‌డం వ‌ల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు న‌యం అవుతాయి.

మామిడి పండ్లను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు(అప్రయోజనాలు):

  • కొందరు వ్యక్తులు మామిడిపండ్లను తింటే అలెర్జీలకు గురయ్యే అవకాశం ఉంది. 
  • మామిడిపండ్లను దండిగా తింటే గనుక కడుపులో ప్రతికూల ప్రభావాన్ని కలిగించ వచ్చు మరియు అది అతిసారానికి దారి తీయవచ్చు . 
  • చాలా దండిగా మామిడిపండ్లను తినడంవల్ల బరువు పెరగవచ్చు. 
  • మామిడి పండ్లు తినడంవల్ల ఇప్పటికే చక్కెరవ్యాధితో (మధుమేహంతో) బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
  • కృత్రిమంగా మాగిన మామిడిపండ్లను తినడంవల్ల క్యాన్సర్, కడుపులో నోప్పి & వివిధ ఇతర వ్యాధులకు దారితీస్తుంది.